గుంతలమయమైన రహదారికి మరమ్మత్తులు చేయాలి

బెల్లంపల్లి పాత జిఎం కార్యాలయం నుంచి భూదా గెస్ట్ హౌస్ వెళ్లే రహదారి గత రెండు రోజులుగా కురిసిన వర్షానికి గుంతల మయంగా మారింది. గుంతలలో వర్షం నీరు నిల్వ ఉండడంతో వాహనదారులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ దారి గుండా బెల్లంపల్లి నుంచి పెద్దబూద, చంద్రవెల్లి తదితర గ్రామాలకు ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తారు. సంబంధిత అధికారులు స్పందించి రహదారికి మరమ్మత్తు చేయాలని ప్రజలు గురువారం కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్