భీమారం మండలంలోని మద్దికల్ గ్రామంలో అత్కూరి శంకర్ ఇంటి వద్ద రెండు తలల పాము కనిపించింది. వెంటనే అటవీశాఖకు సమాచారం అందడంతో, సెక్షన్ ఆఫీసర్ సతీష్, వాచర్ ఎనీరెడ్డి తిరుపతి కలిసి అక్కడికి వెళ్లి పామును పట్టుకున్నారు. కోడి పిల్లల సంచారం ఎక్కువగా ఉండటంతో పాము వచ్చిందని, అనంతరం దానిని సమీపంలోని నీటి కుంటలో వదిలిపెట్టినట్లు అధికారులు తెలిపారు.