దండేపల్లి మండలంలోని మేదరిపేట సమీపంలో మక్కలతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. కడెం నుంచి మంచిర్యాల వైపు వెళ్తుండగా, బైక్ అడ్డు రావడంతో లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.