జన్నారం మండలంలోని అక్కపెల్లి గూడ, పొన్కల్ ప్రైమరీ స్కూళ్ల లోని విద్యార్థులకు పిసిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం బ్యాగులు పంపిణీ చేశారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముడుగు ప్రవీణ్ మాట్లాడుతూ అక్క పెల్లి గూడ ప్రైమరీ స్కూల్ లో 25, పొన్కల్ ప్రైమరి స్కూల్ లో 12 మంది విద్యార్థులకు ఫౌండేషన్ ద్వారా బ్యాగులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు శంకర్, ప్రశాంత్, భాస్కర్ గౌడ్, గంగన్న యాదవ్, దుర్గం తిరుపతి, స్కూల్ హెడ్ మాస్టర్లు శ్రీనివాస్, రాజేశం, టీచర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.