మంచిర్యాలలోని సంజీవయ్య కాలనీలో పైప్ లైన్ కు మరమ్మతులు చేయనున్నందున ఆదివారం పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ శివాజీ తెలిపారు. నీటి సరఫరా అంతరాయానికి పట్టణ ప్రజలు సహకరించాలని కమిషనర్ కోరారు.