మంచిర్యాల పట్టణంలోని రాంనగర్ సబ్స్టేషన్ పరిధిలో ఆదివారం విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు ఏఈ సంధ్యారాణి తెలిపారు. సబ్ స్టేషన్ లో మరమ్మతుల కారణంగా ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు పాత మంచిర్యాల, మార్కెట్ ఏరియా, ఎల్ఐసి కాలనీ, రెడ్డి కాలనీలో తోపాటు పలు కాలనీలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. వినియోగదారులు విద్యుత్ అంతరాయానికి సహకరించాలని కోరారు.