మంచిర్యాల నగరంలోని హైటెక్ సిటీ కాలనీలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పోచమ్మ ఆలయం సమీపంలో నాలుగేళ్ల చిన్నారి యశ్వంత్ పై నాలుగు వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. స్థానికులు గమనించి 108కు సమాచారం అందించడంతో, ఈఎంటి మధుకర్, పైలట్ వెంకటేశ్వరరావు చిన్నారిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.