మంచిర్యాల జిల్లాలో ఏర్పడిన అన్ని సమస్యలను మంత్రులు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కనికారపు అశోక్ కోరారు. ఆదివారం జన్నారంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇరిగేషన్, వ్యవసాయం, ఈజీఎస్, తదితర వాటిల్లో చాలా సమస్యలు ఉన్నాయన్నారు. ఉమ్మడి జిల్లాకు గుండెకాయగా మంచిర్యాల అని తెలిపారు. జిల్లాలోని అన్ని సమస్యలను డిప్యూటీ సీఎం, మంత్రులు పరిష్కరించాలని ఆయన కోరారు.