సీసీసీలోని సుందరయ్య కాలనీకి చెందిన సుందరగిరి శ్రీధర్ (45) అనే పాస్టర్ ఆర్థిక ఇబ్బందులు, షుగర్ వ్యాధితో బాధపడుతూ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఉపేందర్ రావు తెలిపారు. హోలీ మినిస్ట్రీస్ చర్చిలో పనిచేస్తున్న శ్రీధర్, ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. మృతుని కుమారుడు చరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.