గాయని మంగ్లీ, ఆమె సోదరుడు శివపై మైక్రోఫైనాన్స్ పథకాల పేరుతో రూ.కోట్లలో మోసం చేశారంటూ న్యాయవాది సుబ్బారావు ఆరోపించారు. మైక్రోఫైనాన్స్ కేసు నుంచి మంగ్లీ ప్రతిసారి తప్పించుకుంటున్నారని సుబ్బారావు ఆరోపించారు. గద్వాల్, గచ్చిబౌలి, నల్గొండలో కేసులున్నాయని, బాధితులకు డబ్బు చెల్లిస్తే కేసులు వెనక్కి తీసుకుంటామని తెలిపారు. డీజీపీ సీవీ ఆనంద్ను కలిశామని, సీఎం రేవంత్రెడ్డిని కూడా కలుస్తామని చెప్పారు.