వేసవిలో మామిడి పండ్లు రుచికరంగా ఉన్నప్పటికీ, అందరికీ ఆరోగ్యకరం కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించాలి. అధిక బరువు ఉన్నవారు, జీర్ణ సంబంధిత సమస్యలు, అలర్జీలు ఉన్నవారు కూడా మామిడి పండ్లను పరిమితంగా తీసుకోవాలి. తినడానికి ముందు కనీసం 1-2 గంటలు నీటిలో నానబెట్టడం వల్ల వేడి చేసే గుణం తగ్గుతుంది.