ఉత్తరప్రదేశ్లోని హాథ్రస్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడు కావాలని ఓ వివాహిత సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశారు. పూజ అనే వివాహిత రెండేళ్ల క్రితం ఇష్టం లేని వివాహం చేసుకున్నారు. మంగళవారం అత్తింటి నుంచి బయటకు వచ్చిన పూజ నేరుగా సెల్ టవర్ ఎక్కారు. మూడు గంటల పాటు టవర్పైనే ఉన్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెకు సర్ది చెప్పారు. కుటుంబీకులు, ప్రియుడిలో మాట్లాడిన అనంతరం పూజ కిందకు దిగారు.