TG: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎర్రవల్లిలోని కేటీఆర్ నివాసంలో, మాజీ ఎమ్మెల్యే భగత్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. ఇది బీఆర్ఎస్ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చే పరిణామంగా భావిస్తున్నారు.