AP: తిరుమలలో సెప్టెంబర్ 24న శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలు అంకురార్పణ, ధ్వజారోహణంతో ప్రారంభమై వివిధ వాహన సేవలలో భక్తులకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు. చక్రస్నానం, ధ్వజావరోహణంతో అక్టోబర్ 2 నుంచి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో VIP బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు.. సర్వ దర్శనం మాత్రమే ఉంటుందని టీటీడీ ప్రకటించింది.