ముంబైలోని వెస్ట్ జోగీశ్వర్లో ఉన్న JMS బిజినెస్ సెంటర్ భవనంలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పైఅంతస్తులకు వ్యాపించడంతో కొందరు వ్యక్తులు లోపల చిక్కుకున్నట్లు సమాచారం. ముంబై అగ్నిమాపక దళం దీనిని లెవల్-2 అగ్నిప్రమాదంగా ప్రకటించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.