చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ జట్టు పేలవ ప్రదర్శన చేసింది. 11 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 69 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లు నిస్సాంక (19), కేఎల్ రాహుల్ (12) తక్కువ స్కోర్కే ఔటయ్యారు. కరుణ్ నాయర్ (13) కూడా స్వల్ప స్కోర్కే పెవిలియన్ చేరడంతో జట్టు పవర్ప్లేను సద్వినియోగం చేసుకోలేకపోయింది. ప్రస్తుతం స్టబ్స్, రిజ్వీ క్రీజులో ఉన్నారు.