పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ, కొత్త ఆశలతో ప్రపంచం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 'ఈ ఏడాది అందరికీ అద్భుతమైన సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను. 2026లో మీ అన్ని ప్రయత్నాలు విజయవంతం కావాలని.. మంచి ఆరోగ్యం, శ్రేయస్సు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నా. సమాజం శాంతి, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నా' అని ఆయన ఎక్స్లో రాసుకొచ్చారు.