ఈ నెల 11న చేగుంటలో తన ఆటోను బంధువుల ఇంటి వద్ద ఉంచి వెళ్లిన దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామానికి చెందిన పాములపర్తి స్వామి (45) అదృశ్యమయ్యాడు. స్వామి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు గాలించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో స్వామి భార్య రజిత పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. ఈ ఘటన స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది.