ఐపీఎల్ మ్యాచ్ల సందడి నేపథ్యంలో, గ్రామాల్లో బిగ్ స్క్రీన్లపై మ్యాచ్లు ప్రదర్శించినా లేదా బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని చిన్నశంకరంపేట ఎస్సై నారాయణ గౌడ్ హెచ్చరించారు. ప్రజలు బాధ్యతగా వ్యవహరించి, అనుమానాస్పద స్క్రీన్లు లేదా బెట్టింగ్ కార్యకలాపాలు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.