చేగుంట మండలంలో ఈదురు గాలుల కారణంగా విద్యుత్ తీగలు ఒకదానికొకటి తగిలి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో చేతికొచ్చిన వరి పొలం దగ్ధమైంది. సుమారు రూ.50 వేల వరకు పంట నష్టం జరిగిందని బాధిత రైతు నరసింహులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.