మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానిపల్లి గ్రామంలో ఉన్న శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో సోమవారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు.