మెదక్ పట్టణంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ కోదండ రామాలయం స్వాధీనం కోసం శుక్రవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఆలయానికి చేరుకున్నారు. ఇన్స్పెక్టర్ రంగారావు నేతృత్వంలో ఆరి లక్ష్మణ్, పోలీసు బలగాల రక్షణతో సిబ్బంది ఆలయానికి రాగా, ఆలయ కమిటీ సభ్యులు కఠినంగా వ్యతిరేకించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ.. ఆలయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ శాఖకు ఇచ్చేది లేదన్నారు. తాళం వేసేందుకు చేసిన ప్రయత్నాలను ఆపారు.