సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు తమ ఇళ్లకు తాళం వేసి ఊర్లకు వెళ్లే సమయంలో దొంగతనాలు జరిగే అవకాశం ఉందని, కాబట్టి నగదు, బంగారు ఆభరణాలను బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాస రావు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, చోరీల నివారణకు ప్రజల సహకారం కీలకమని ఆయన పేర్కొన్నారు.