మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానుపల్లి గ్రామంలో ఉన్న శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయం ముందు మంగళవారం నీటి ప్రవాహం కొనసాగింది. ఆలయ ప్రాంగణంలో నీటి ప్రభావం కొనసాగుతున్నందున, అధికారులు బారికేడ్లను ఏర్పాటు చేశారు.