శివంపేట మండలం శబాష్పల్లిలో సందనబోయిన ఆంజనేయులు కుమారుడు గేదెను పంట పొలాలకు తీసుకెళ్తుండగా, తెగిపడి ఉన్న విద్యుత్ తీగలు గేదెకు తాకాయి. దీంతో గేదె అక్కడికక్కడే మృతి చెందింది. అదృష్టవశాత్తూ బాలుడు ప్రమాదాన్ని గుర్తించి అప్రమత్తంగా ఉండటంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.