నర్సాపూర్లోని బీవీఆర్ఐటీలో జరిగిన “ఈటి ఉత్సవ్–2026” అంతర్జాతీయ సదస్సు విజయవంతంగా ముగిసింది. సస్టైనబిలిటీ, ఆటోనమస్ వాహనాలపై జరిగిన ఈ కార్యక్రమంలో దేశ విదేశాల నిపుణులు పాల్గొన్నారు. ఈ సదస్సులో ఐఐటీ హైదరాబాద్ డా. రూపేష్, జపాన్కు చెందిన డా. టోరి, ఇండోనేషియా డా. జోషువా తమ ప్రసంగాలతో సదస్సుకు వన్నె తెచ్చారు. మేనేజ్మెంట్ సహకారంతో ఈ సదస్సును విజయవంతంగా నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.