మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి అక్రమంగా సస్పెండ్ చేసిన నేపథ్యంలో గురువారం హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నాకు దిగారు. మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.