కొల్చారం మండలంలోని నాయిని జలాల్పూర్ గ్రామంలో గుర్తుతెలియని దుండగులు రాత్రిపూట ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడ్డారు. బీరువాలో ఉన్న రెండు తులాల బంగారు నెక్లెస్, రూ. 46 వేల నగదు, వెండి కడియాలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.