నర్సాపూర్ మండలం రుస్తుంపేట గ్రామానికి చెందిన పిట్ల నరేష్ (25) ఆదివారం పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ, మంగళవారం అతని పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఏడాది క్రితమే వివాహం జరిగిన నరేష్ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.