సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యతో గొడవ పడి భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బీర్ల నాగరాజు (30) కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన అనితతో 15 నెలల క్రితం వివాహమైంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో నాగరాజు మనస్తాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.