ఛత్రపతి శివాజీ కాళ్లను అంబేద్కర్ మొక్కినట్లు తప్పుడు ఫోటోలు క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన గొల్లగూడెంకు చెందిన అరుణ్, ఉత్తరపల్లికి చెందిన లల్లు యాదవ్ లను సంగారెడ్డి రూరల్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ వైరల్ కావడంతో దళిత సంఘాల నాయకులు రూరల్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. పోస్ట్ చేసిన ఇద్దరి పై ఫిర్యాదు చేశారు.