TG: ప్రభుత్వం ఆధ్వర్యంలో మేడారం మహా జాతర సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి సీతక్క తన సొంత గడ్డపై భక్తులతో కలిసి సందడి చేశారు. వనదేవతల గద్దెల చెంత ఆదివాసీల సంప్రదాయ నృత్యాలు చేస్తూ ప్రజల్లో ఒకరిగా కలిసిపోయారు. మంత్రి స్వయంగా నృత్యం చేయడంతో జాతరలో ఉత్సాహం రెట్టింపు అయింది. ఈ ప్రత్యేక దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.