ఢిల్లీలోని 'మెట్రో పోస్టర్ కేసు'లో సూత్రధారిగా వ్యవహరించిన ఎల్ఈటీ ఉగ్రవాది షబీర్ అహ్మద్ లోన్ను అధికారులు పాటియాలా హౌస్ కోర్టుకు తరలించారు. ఫిబ్రవరి 7, 2026న ఢిల్లీలోని కాశ్మీరీ గేట్, జనపథ్ వంటి ప్రాంతాల్లోని మెట్రో పిల్లర్లపై దేశ వ్యతిరేక, అభ్యంతరకరమైన పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. ఈ కేసులో ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ చేపట్టిన దర్యాప్తులో షబ్బీర్ అహ్మద్ లోన్ను పట్టుకున్నారు.