తూర్పు కాంగో రుబాయా ప్రాంతంలోని ఓ Coltan మైన్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. గని ఒక్కసారిగా కూలిపోవడంతో 200 మందికి పైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్లో వాడే ఈ లోహం కోసం అక్కడ మైనింగ్ జరుగుతోంది. రెబల్స్ కంట్రోల్లో ఉన్న ఈ గనుల్లో సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఘటనలో ప్రాణనష్టం ఎక్కువగా ఉండటం అందరినీ కలచివేస్తోంది.