ఖనిజ వనరులున్న రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రేర్ ఎర్త్ మినరల్స్ కోసం 4 రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ మేరకు బడ్జెట్ ప్రసంగంలో ఆమె పేర్కొన్నారు. ఏపీ, ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో ప్రత్యేక మైనింగ్ మిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రపంచస్థాయి కంటెయినర్ ఉత్పత్తి కార్పొరేషన్ నెలకొల్పుతామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.