మంత్రి జూపల్లి కృష్ణారావు కాసేపట్లో గాంధీభవన్కు చేరుకోనున్నారు. ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనే ముందు, ఉదయం 11 గంటలకు తెలంగాణభవన్కు వెళ్లనున్నారు. మంత్రి కేటీఆర్ చేసిన అప్పులపై సవాల్ను స్వీకరించిన జూపల్లి, ఆయనతో చర్చకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అప్పుల విషయంలో తన వాదన తప్పని తేలితే తన పదవికి రాజీనామా చేస్తానని జూపల్లి ప్రకటించారు. ఈ నేపథ్యంలో గాంధీభవన్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.