TG: రాష్ట్రంలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులు, వితంతువులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి గుడ్న్యూస్ చెప్పారు. కొత్త పింఛన్ల అంశాన్ని త్వరలో కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. భూ సమస్యలను ‘భూ భారతి’ ద్వారా పరిష్కరిస్తామని, రైతులకు క్వింటాల్కు రూ.500 బోనస్తో వరి కొనుగోలు కొనసాగుతుందని చెప్పారు.