జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నా: మంత్రి ఉత్తమ్‌

స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్ పై BRS మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తెలిపారు. స్పీకర్‌ను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలపై ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై చర్చిస్తున్నాట్లు తెలిపారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై స్పీకర్ తక్షణమే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని.. ఈ అంశాన్ని అంత సులువుగా వదిలేయొద్దు అని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్