TG: నదీ జలాలకు సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో జరిగిన అన్యాయానికి శాశ్వత పరిష్కారాలు సాధించాలని మంత్రి ఉత్తమ్కు సీఎం సూచనలు జారీచేశారు. దీంతో మంత్రి ఉత్తమ్ కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్కు లేఖ రాశారు. పెండింగ్, సాగునీటి ప్రాజెక్టులపై వెంటనే చొరవ చూపాలని లేఖలో కోరారు. కృష్ణా, గోదావరి బేసిన్లలో సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు.