నేడు, రేపు రాష్ట్రంలో మోస్త‌రు వ‌ర్షాలు

నైరుతి రుతుప‌వ‌నాల విస్త‌ర‌ణతో తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షాలు ప‌డుతున్నాయి. బంగాళాఖాతంలో కొన‌సాగుతున్న ద్రోణి ఫ‌లితంగా ఇవాళ‌, రేపు తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. గంట‌కు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. వ‌ర్షాల నేప‌థ్యంలో రైతులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వాతావ‌ర‌ణ శాఖ సూచించింది.

సంబంధిత పోస్ట్