భారత్ పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. పాలం విమానాశ్రయంలో పుతిన్ ఫ్లైట్ దిగగానే, మోదీ తన సెక్యూరిటీ ప్రోటోకాల్ను పక్కనపెట్టి నేరుగా వెళ్లి ఆయనను ఆలింగనం చేసుకుని స్వాగతించారు. భారత్కు స్నేహితుడిగా పరిగణించే పుతిన్ కోసం మోదీ ప్రోటోకాల్ను సైతం పక్కనపెట్టడం విశేషంగా మారింది.