విషాదం.. పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

TG: వికారాబాద్‌ జిల్లా చౌడాపూర్‌ మండలం అడవివెంకటాపూర్‌లో శనివారం ఒక తల్లి తన ఇద్దరు పిల్లలను ఉరివేసి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. నవనీత (28) అనే తల్లి తన ఏడేళ్ల కుమారుడు విగ్నేశ్‌, ఐదేళ్ల కుమార్తె మధుప్రియలను చంపి, అనంతరం తాను కూడా ప్రాణాలు తీసుకుంది. 'నా చావుకు ఎవరూ కారణం కాదు. నాకు బతకాలని లేదు. పిల్లలు అనాథలవుతారని వారిని కూడా తీసుకుపోతున్నా. భర్త కారణం కాదు, అతన్ని ఏమీ అనొద్దు' అని రాసిన సూసైడ్‌ నోట్‌ లభించినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్