TG: హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సిద్దిపేట జిల్లాల్లో పెట్రోల్ కోసం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న రాత్రి నుంచి బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలో నిల్చుంటున్నారు. చాలా వరకు బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు కనిపిస్తున్నాయి. ఇంధనం అయిపోతుందనే ఆందోళనతో 'పానిక్ బయింగ్' వల్ల సాధారణ వినియోగదారులు సైతం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు.