అమెరికా అధ్యక్షుడు ట్రంప్ "భారత ఆర్థిక వ్యవస్థ మృత స్థితిలో ఉందని" చేసిన వ్యాఖ్యను రాహుల్ గాంధీ సమర్థించడంతో కాంగ్రెస్ పార్టీలో దుమారం రేగింది. శశి థరూర్, రాజీవ్ శుక్లా, ఇమ్రాన్ మసూద్ వంటి నేతలు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తీవ్రంగా విభేదించారు. ‘‘ఇది భారత్పై అవమానకర వ్యాఖ్య’’ అని మండిపడ్డారు. ట్రంప్ అలా అనడం, రాహుల్ ఏకీభవించడం సరికాదన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో మనందరికీ తెలుసని అన్నారు.