బుల్లితెర నుండి వెండితెరపైకి వచ్చిన మృణాల్ ఠాకూర్, బాలీవుడ్లో 'సూపర్ 30', 'బాట్లా హౌస్' వంటి చిత్రాలతో హిట్ అందుకుంది. అయితే, 'జెర్సీ' వంటి చిత్రాలు ఫ్లాప్ అవ్వడంతో పాటు, బాలీవుడ్లో వరుస డిజాస్టర్లు ఎదుర్కొంది. ఈ సమయంలోనే టాలీవుడ్లో 'సీతామహాలక్ష్మీ'గా భారీ విజయం సాధించి, తన క్రేజ్ను పెంచుకుంది. ప్రస్తుతం 'దో దీవానే శెహర్ మే' వంటి చిత్రాలతో బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.