ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 12 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ముంబై ఇచ్చిన 206 పరుగుల లక్ష్యఛేదనలో ఢిల్లీ జట్టు 19 ఓవర్లలో 193 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ గెలుపుతో ముంబై జట్టు వరుస విజయాలతో స్పీడ్గా దూసుకుపోతున్న ఢిల్లీకి బ్రేక్ వేసింది. DC బ్యాటర్లలో కరుణ్ నాయర్ (87) అర్థశతకంతో రాణించారు. ముంబై బౌలర్లలో కర్ణశర్మ 3, సాంట్నర్ 2 వికెట్లు తీశారు.