ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో శనివారం ఆవనూనెతో వెళ్తున్న ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ఘటనలో నేలపాలైన నూనెను స్థానికులు బకెట్లు, బాటిళ్లు, క్యాన్లలో నింపుకొని ఎత్తుకెళ్లారు. గంటల తరబడి ఈ తతంగం కొనసాగినా పోలీసులు ఘటనా స్థలానికి రాలేదు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.