ప్రముఖ గాయకుడు SP బాలసుబ్రహ్మణ్యం రాజకీయాలకు అతీతంగా ఉండేవారని, అందరినీ సమానంగా చూసేవారని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతి ఆవరణలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో చరణ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం, తెలుగు ప్రజలు, విగ్రహం ఏర్పాటుకు కృషి చేసిన బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి అందరితో స్నేహపూర్వకంగా ఉండేవారని ఈ కార్యక్రమం నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.