టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్తో తమ నాలుగవ తమిళ ప్రాజెక్ట్ ను చెన్నైలో ఘనంగా ప్రారంభించింది. కరణ్ ఎ. కుమార్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో పృథ్విరాజ్, సాయి దీన కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది ధ్రువ్ విక్రమ్ కెరీర్ లో ఒక విభిన్నమైన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనుంది. సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.