ప్రముఖ నటుడు నాగార్జున, గత జన్మల నేపథ్యంతో సాగే చిత్రాలంటే తనకు చాలా ఇష్టమని, 'గత వైభవం' సినిమా ట్రైలర్ చూస్తే టీమ్ ఎంత కష్టపడిందో అర్థమైందని తెలిపారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, దుష్యంత్, ఆషికా రంగనాథ్ జంటగా నటించిన ఈ చిత్రం ఈనెల 14న విడుదల కానుందని, విజయం సాధించాలని ఆకాంక్షించారు. 'గత వైభవం' నాలుగు తరాల కథ అని, తొలి సినిమాతో దుష్యంత్ టెన్షన్ను ఊహించగలనని, ఆషిక చక్కని నటి అని కొనియాడారు.